మొక్కలు నాటిన నటుడు (విలన్) శత్రు..

571
Actor Shatru
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హీరో సందీప్ మాధవ్, సత్యం రాజేష్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రముఖ నటుడు విలన్ శత్రు నేడు జూబ్లీహిల్స్‌లోని పార్కులో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు కార్బన్ డైయాక్సైడ్‌ను పీల్చుకొని మనకు ప్రాణవాయువు అయిన ఆక్సిజన్‌ను ఇస్తున్నాయని కాబట్టి రోజు రోజుకి తగ్గిపోతున్న ఆక్సిజన్ పెంచడం కోసం అందరం బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి మా అందరి చేత మొక్కలు నాటిస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా నటుడు శత్రు మరో ముగ్గురు ఆది పినిశెట్టి, జెపి, హరీష్ ఉత్తమన్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -