మొక్కలు నాటిన నటుడు ప్రదీప్..

155
pradeep
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సోమాజి గూడ లోని తన నివాసం లో మొక్కలు నాటారు నటుడు ప్రదీప్.అనంతరం మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని నటుడు ప్రదీప్ అన్నారు. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒకడిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు.

సినీ డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ సోమాజి గూడ లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటిన నటుడు ప్రదీప్.అనంతరం మరో ముగ్గురు ( మాజీ ఐ. పి.ఎస్ ఆఫీసర్ జె.డి లక్ష్మి నారాయణ , సింగర్ రోహిత్ , నటుడు సాయికుమార్ )లు కూడా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు….

- Advertisement -