మొక్కలు నాటిన కార్తీకదీపం డాక్టర్ బాబు..

61
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్కలు నాటారు కార్తీకదీపం సీరియల్ ఫేం నటుడు నిరుపమ్(డాక్టర్ బాబు).

ఈ సందర్భంగా నిరుపమ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టడం ఆనందంగా ఉందని అన్నారు.ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ కార్యక్రమం ఏంతో అవసరమని ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.కాలుష్యాన్ని అరికట్టేందుకు పర్యావరణానికి మొక్కలు ఎంతో మేలు చేస్తాయి అని అన్నారు.నా వంతుగా ఈ రోజు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటానని తెలిపారు.ఈ సందర్భంగా తన సహా నటులు ప్రీతం,అమర్ దీప్ చౌదరి,మానస ముగ్గురికి గ్రీన్ఇండియా చాలెంజ్ ఇచ్చారు నిరుపమ్.

- Advertisement -