మొక్కలు నాటిన గుజరాతి నటుడు మలహార్ టాకర్

180
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ నటి మోనాల్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు చెన్నై లోని తన నివాసంలో కుండీ లో మొక్కలు నాటి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు ప్రముఖ గుజరాతి నటుడు మలహార్ టాకర్.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అని ఎవరికి తోచిన విధంగా వారు కుదిరిన చోట మొక్కలు నాటాలని కోరారు.ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ చాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని అందుకోసం నటీ మనీష్ పరేఖ్, నటి దీక్ష జోషి, ఆరోహి లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -