గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న నటీ లక్ష్మీ ప్రియ..

160
Actor Lakshmi Priya
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సినీ నాటి లక్ష్మీ ప్రియా మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మనకు ఆరోగ్యం, అందం కావాలన్న ప్రతి ఒక్కరం చెట్లు పెట్టాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించి అందమైన ఆస్వాదన్ని పొందవచ్చని లక్ష్మీ ప్రియ తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మార్పును తీసుకొస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.

సినీ నటుడు జాకీ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ ననేక్రం గూడలో సినీ నటీమణి లక్ష్మీ ప్రియా మొక్కలు నాటి అనంతరం మరో ముగ్గురు (ఆర్టిస్ట్ సుజాత.ఆర్టిస్ట్ సత్యశ్రీ..ఆర్టిస్ట్ వాని) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్‌ను విసరాలని సినీ నటీమణి లక్ష్మీ ప్రియ పిలుపునిచ్చారు.

- Advertisement -