మహేష్ తో రజనీకాంత్ – అమీర్ ఖాన్

11
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా షూటింగ్‌ స్టార్ట్ చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఫస్ట్ షెడ్యూల్ మొదలు అవుతుందట. ఈ మేరకు సూపర్ స్టార్‌ క్లాస్సీ లుక్‌ను కూడా డిజైన్ చేశారు. మరిన్ని అప్డేట్స్ త్వరలోనే ప్రకటిస్తారు అని తెలుస్తోంది. అయితే, సుదీర్ఘ విరామం తర్వాత కోలీవుడ్‌ దిగ్గజ నటుడు రజనీకాంత్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నాడు. ఎప్పుడో పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ ఓ అతిధి పాత్రలో నటించి మెప్పించాడు. మళ్లీ ఆ తర్వాత ఎక్కడా రజనీ మరో తెలుగు సినిమాలో ప్రత్యేకంగా అతిధి పాత్ర చేయలేదు.

కానీ, రాజమౌళి సినిమా కావడం, పైగా మహేష్ బాబు హీరో కావడం ఇప్పుడు ఈ చిత్రంలో రజనీకాంత్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయితే, ఈ విషయాన్ని మేకర్స్ ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి 2026 ద్వితియార్థంలో రిలీజ్‌ చేయాలని రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ జీవితంలోనే ఈ సినిమాను ప్రత్యేకంగా తీయాలని రాజమౌళి ఫీల్ అవుతున్నారు.

Also Read:Roja:రోజాకు నో టికెట్?

అలాగే బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూడా ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి అమీర్ ఖాన్ కూడా మహేష్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే.. అంతకుమించిన విశేషం మరొకటి ఉండదు. ఇంతకీ, ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రస్తుతం ఉన్న టాక్ ప్రకారం ఈ సినిమా కోసం మహేష్ బాబు ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నాడు. అటు రాజమౌళి కూడా ఈ సినిమా పై ఫుల్ ఫోకస్ పెట్టాడు.

- Advertisement -