మంత్రి కేటీఆర్‌ని కలిసిన ఆదివాసి సంఘాల ప్రతినిధులు..

51
minister
- Advertisement -

హైదరాబాద్‌ ప్రగతి భవన్ లో మంత్రి కే. తారక రామారావు ని కలిశారు ఆదివాసి సంఘాల ప్రతినిధులు మరియు తెరాస ఆదివాసి ప్రజాప్రతినిధులు. ఈ సందర్భంగా తమ తెగలు ఎదుర్కొంటున్న పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కేటీఆర్ ను కోరారు. షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీల కోసం తీసుకోవాల్సిన అభివృద్ధి సంక్షేమ చర్యల పైన తమ అభిప్రాయాలను తెలియజేశారు.

తక్కువ సంఖ్యలో… ఎక్కువ ప్రాంతాల్లో నివాసం ఉండే ఆదివాసీలకు కు ప్రభుత్వం మరింత చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీల కు సంబంధించిన సమస్యల పైన ఆయా ప్రతినిధులు, నాయకుల అభిప్రాయాలు విన్న అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఇప్పటికే ఆదివాసీ సమస్యలపైన మా ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ముఖ్యంగా ఆదివాసి రైతులకు సంబంధించి అటవీశాఖ భూముల విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఆదివాసులు వ్యవసాయం చేసుకుంటున్న అటవీ భూములు పైన హక్కు పత్రాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్ ఓ ఎఫ్ ఆర్ చట్టానికి సంబంధించిన పరిమితులున్న విషయాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఈ విషయంలో సాధ్యమైనంత ఎక్కువ సానుకూల దృక్పధాన్ని మా ప్రభుత్వం కలిగి ఉందని తెలిపారు. ఆదివాసీల మావ మాటే … మావ రాజ్ నినాదం స్ఫూర్తి మేరకే తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు గిరిజన తండాలను, ఆదివాసీ గుడెలను గ్రామ పంచాయతీలుగా మార్చి పరిపాలనాధికారన్ని ప్రజలకు దగ్గరగా చేసిందన్నారు.

అడవి ప్రాంతంలో నివాసముండే ఆదివాసీలకు అవసరమైన వైద్య విద్యా సదుపాయాలు పైన ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ విషయంలో ఆదివాసీలకు మరింత సహాయకారిగా ఉండేందుకు త్వరలోనే విద్య వైద్య శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతాం అన్నారు. విద్య వైద్య విషయాల్లో సంతృప్త స్థాయి వరకు అందరికీ నాణ్యమైన సేవలు అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

- Advertisement -