తమిళ హాస్య నటుడు వడివేలు…దర్శకుడు శంకర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. శంకర్ గ్రాఫిక్ సన్నివేశాలతోనే దర్శకుడిగా నెట్టుకొస్తున్నారు..అసలు ఆయన దర్శకుడే కాదు గ్రాఫిక్స్ డైరెక్టర్ అంటూ విమర్శలు గుప్పించారు.
దర్శకుడు శంకర్ నిర్మాణంలో శింబుదేవన్ దర్శకత్వంలోని 24మ్ పులికేసి సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించిన వడివేలు …24మ్ పులికేసిలో వన్లైన్తో మాత్రమే శింబు దేవన్ తన దగ్గరికి వచ్చారు. అయితే తాను పూర్తి స్థాయిలో చర్చించి.. అందులో త్రిపాత్రాభినయం వచ్చేలా కథ మార్చా. అంతేకాకుండా హాస్య సన్నివేశాలు కూడా చెప్పా. అప్పుడు సంపూర్ణ చిత్రంగా మారిందన్నారు వడివేలు.
తమిళ సినీ రంగంలో వడివేలుకు ప్రత్యేక స్ధానం ఉంది.ఆయనని అభిమానించని ప్రేక్షకులు ఉండరు. దాదాపు 18 ఏళ్ల క్రితం విడుదలైన ఫ్రెండ్స్ చిత్రంలో కాంట్రాక్టర్ నేసమణి అనే పాత్ర పోషించారు. అందులో ఆయన తలపై సుత్తి పడటంతో బలమైన గాయమవుతుంది. ఆ సన్నివేశానికి కొనసాగింపుగా కొన్ని రోజులుగా లేని విషయం ఉన్నట్లు సోషల్ మీడిమాలో వడివేలు టాపిక్గా ట్రెండింగ్గా మారింది. దీనిపై కూడా వివరణ ఇచ్చారు వడివేలు.