మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వాల్మీకి. తమిళ మూవీ జిగర్తాండకు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో వరుణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. సినిమాపై ప్రేక్షకుల్లో మళ్లీ ఆసక్తిని రేకెత్తించడానికి మూవీ ప్రీ-టీజర్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు రంజాన్ పండుగను పురష్కరించుకుని దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన చేశారు.
పవిత్రమైన రోజున వాల్మీకి టీమ్ తరఫున ఈ ప్రకటన చేయడం ఆనందంగా ఉంది. ప్రీ-టీజర్తో అతి త్వరలో మీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం అని ట్వీట్లో పేర్కొన్నారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. రాక్స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆయానకా బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
జనవరిలో లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీకి ఆదిలోనే ఆటంకాలు ఏర్పడ్డాయి. వాల్మీకి టైటిల్పై వివాదం చెలరేగింది. గ్యాంగ్స్టర్ మూవీకి వాల్మీకి పేరు పెట్టడంపై ఆ సామాజికవర్గానికి చెందిన వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.