దీపావళి కానుకగా ‘అమెజాన్‌ యోధులు’

181
online news portal
- Advertisement -

‘అమెజాన్‌ యోధులు’ ప్రముఖ హాలీవుడ్‌ నటులు రిచాజెన్‌, సెసిలియా చియాంగ్‌ జంటగా ఇండో ఓవర్సీస్‌ బ్యానర్‌పై ఫ్రాంకీఛాన్‌ దర్శకత్వంలో 500 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌లో జాకీచాన్‌ నిర్మించిన చిత్రం ‘ది లెజండరీ అమెజాన్స్‌’. ఈ చిత్రం హాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసి భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని సాయి శ్రీజ విఘ్నేష్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై జి.వంశీకృష్ణ వర్మ ‘అమెజాన్‌ యోధులు’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘మాహిష్మతి రాజ్యం’ ఉపశీర్షిక. దీపావళి కానుకగా అక్టోబర్‌ 29న ఈ చిత్రం రిలీజవుతోంది.

online news portal

ఈ సందర్భంగా నిర్మాత జి.వంశీకృష్ణ వర్మ మాట్లాడుతూ – ”ప్రముఖ హాలీవుడ్‌ నటుడు జాకీచాన్‌ 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. హాలీవుడ్‌లో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచి సరికొత్త రికార్డ్‌లు నెలకొల్పింది. తెలుగు ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఈ చిత్రం వుంటుంది. ‘బాహుబలి’ చిత్రం తరహాలో ఈ చిత్రంలోని యుద్ధ సన్నివేశాలు భారీగా వుంటాయి. యాక్షన్‌ సీన్స్‌ అన్నీ చాలా థ్రిల్లింగ్‌గా వుంటాయి. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా సన్నివేశాలుంటాయి. డెఫినెట్‌గా ఈ సినిమా సక్సెస్‌ అయ్యి నిర్మాతగా నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. మా డిస్ట్రిబ్యూటర్స్‌ అందరూ ఎంతో కాన్ఫిడెంట్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 29న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం” అన్నారు.

online news portal

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ నాగేశ్వరరావు మాట్లాడుతూ – ”బాహుబలి’లాంటి చిత్రమిది. ప్రేక్షకులకు నచ్చేవిధంగా యాక్షన్‌ సీన్స్‌, యుద్ధ సన్నివేశాలు చాలా ధ్రిల్లింగ్‌గా ఉంటాయి. ప్రతి విజువల్‌ చాలా గ్రాండియర్‌గా ఉంటుంది. దీపావళి పండగకి ఇంతటి భారీ బడ్జెట్‌ చిత్రాన్ని రిలీజ్‌ చేయడం మాకెంతో ఆనందంగా వుంది. ఈచిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం వుంది” అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత-జి. యుగంధర్‌రెడ్డి, నిర్మాత-జి.వంశీకృష్ణ వర్మ, దర్శకత్వం- ఫ్రాంకీ ఛాన్‌.

online news portal

- Advertisement -