టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న ‘చిత్రం భరత్ అనే నేను’. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. ఇప్పటి వరకు మహేష్కి సంబంధించి విడుదలైన లుక్స్ అభిమానులలో భారీ అంచనాలు పెంచాయి. ఇటీవలే చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఏప్రిల్ 1న దేవి శ్రీ సంగీత సారధ్యంలో రూపొందిన ఐ డోంట్ నో అనే సాంగ్ విడుదల చేశారు.
తాజాగా ఈ చిత్రం నుండి రెండో పాట ఈ ఉదయం 10 గంటలకు సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల కాగా, నిమిషాల్లోనే వైరల్ అయింది. చిత్ర సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కోరిక మేరకు బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ఈ పాట పాడగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. సినిమా విడుదలకు ఇంకా మూడు వారాల సమయం మాత్రమే ఉండటంతో, సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగం చేసిన చిత్ర యూనిట్ ఇప్పటికే టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయగా, యూ ట్యూబ్ లో అది సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇక ‘ఐ డోంట్ నో…’ అంటూ సాగే ఈ పాటను ప్రస్తుతం పిన్స్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక ఈ మూవీ ఆడియో వేడుకను ఏప్రిల్ 7వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీస్థాయిలో జరపనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకు ఎన్టీఆర్ను .. చరణ్ను గెస్ట్లుగా మహేష్ ఆహ్వానించనున్నట్టు సమాచారం.భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20న భారీ ఎత్తున విడుదల కానుంది. కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శరత్ కుమార్ , ప్రకాష్ రాజ్, దేవరాజ్, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.