మామూలుగానే మనం పామును చూడగానే వామ్మో అంటూ భయంతో పరుగులు తీస్తుంటాం. కానీ ఆ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం సరదాగా పాముతో ఆడుకుంటోంది. ఆ హీరోయినే నివేదా థామస్. ఈ బ్యూటీ… ఓ కొండచిలువతో హాయిగా ఆడుకుంటున్న కొన్ని ఫొటోలను తన ఇన్స్టగ్రామ్లోఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పుడవే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
‘బాబ్రా (కొండచిలువ)ను కలిశాను. చాలా చిన్న మంచి విషయం. నేను అనుకున్నంత చిన్న విషయమేం కాదు’ అని కాప్షన్ ని జోడించింది. ఇక ఆ పోస్ట్ ను చూసిన నెటిజన్లు …ఎంత ఇష్టంగా పట్టుకున్నావ్’, ‘ఓ మై గాడ్’, వామ్మో ఎంత ధైర్యంగా కొండచిలువను పట్టుకున్నావంటూ కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న నటి ఇలా ప్రమాదకర ప్రాణులతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుందని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కాగా, నాని హీరోగా నటించిన జెంటిల్మెన్ మూవీతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది నివేదా థామస్. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు ఆపై నిన్నుకోరి, జైలవకుశ లాంటి భారీ ప్రాజెక్టుల్లో నటించారు. మూడు ప్రాజెక్టుల్లో నివేదా నటిస్తున్నారని ప్రచారం జరగగా అందులో వాస్తవం లేదని నటి కొట్టిపారేసిన విషయం తెలిసిందే.