త్రిపాఠికి కోపమొచ్చింది..

221
- Advertisement -

త‌న గురించి గాసిప్స్ రాస్తోన్న వారిపై హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠికి ఫైర్‌ అవుతోంది. 100% కాదల్ సినిమాకు సైన్ చేసి..మధ్యలో ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

అయితే, ఆమె ఆ సినిమా నుంచి తప్పుకోవడంపై నడిగర్‌ సంఘం ఆమెపై రూ.3 కోట్ల దావా వేసినట్లు ప్ర‌చారం జరుగుతోంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో దీనిపై స్పందించిన లావ‌ణ్య త్రిపాఠి అన్ని విషయంల్లోనూ తాను నిదానంగా వ్యవహరిస్తానని తెలిపింది.

lavanya tripathi fires

తాను మౌనంగా ఉన్నాన‌ని ఇష్టమొచ్చినట్లు రాసేస్తే ఎలా? అని లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌శ్నించింది. ఇటువంటి పుకార్లు త‌న‌పై ఎటువంటి ప్రభావం చూపవని పేర్కొంది. త‌న‌కు తృప్తినిచ్చే కథలనే ఎంచుకుంటానని. త‌న‌ను ఉత్సాహ పరిచే సినిమాల్లోనూ నటిస్తానని తెలిపింది.

- Advertisement -