ఫిదా కోసం తగ్గేదే లేదంటున్న దిల్ రాజు

172
Dil-Raju-Comments
- Advertisement -

దిల్ రాజు నిర్మాణంలో భారీ స్థాయిలో ‘ఫిదా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకి మించి ఈ సినిమా ఆదరణ పొందుతోంది. ఈ సినిమా తరువాత ‘నేనే రాజు నేనే మంత్రి’ .. ‘జయ జానకి నాయక’ .. ‘లై’ సినిమాలు రంగంలోకి దిగాయి. ఈ మూడు సినిమాలు కూడా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. అయినా ‘ఫిదా’ తన దూకుడును కొనసాగిస్తూనే వుంది.

దాంతో ఇప్పట్లో ఈ సినిమాను థియేటర్ల నుంచి తీసే ఆలోచన లేదని దిల్ రాజు అంటున్నారట. ఈ వారం కొన్ని సినిమాలు విడుదల కావలసి వుంది. అయితే ‘ఫిదా’ను థియేటర్ల నుంచి తీయడానికి దిల్ రాజు అంగీకరించపోవడంతో, ఒక్క ‘ఆనందో బ్రహ్మ’ మాత్రమే రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎందుకంటే నేనే రాజు నేనే మంత్రి ఆల్ మోస్ట్ విడుదలయిన అన్ని థియేటర్లలో వుంటుంది.

అదే విధంగా జయ జానకి నాయక కూడా వుండే అవకాశం వుంది. ఎందుకంటే దానికి దొరికిని థియేటర్లే తక్కువ. ఇక లై కొన్ని ఏరియాల్లో తీసే అవకాశం వుంది. ఆ థియేటర్లు తీసుకోవచ్చు.

- Advertisement -