భారత్ చేపట్టిన BRICS అధ్యక్షత ‘స్థిరత్వం/కోలుకునే శక్తి , ఆవిష్కరణ , సహకారం , సుస్థిరత అనే నాలుగు ముఖ్యమైన స్తంభాలపై దృష్టి సారించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (సెప్టెంబర్ 13) తెలిపారు. BRICS భాగస్వామ్య దేశాల మద్దతుతో భారత్ ఈ కూటమి యొక్క ఉమ్మడి దృక్పథాన్ని ‘పరస్పర లాభదాయకమైన సహకారం’గా మలిచిందని ఆయన పేర్కొన్నారు. సమ్మిట్ రెండో రోజున BRICS నాయకులు న్యూఢిల్లీలోని భారత్ మంటపానికి చేరుకున్నారు. అక్కడ ‘స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత’పై జరిగే ప్రధాన రౌండ్టేబుల్ సమావేశానికి ముందు వారు కలిసి ఫ్యామిలీ ఫోటో దిగారు.
అంతకుముందు శనివారం పశ్చిమాసియా సంఘర్షణపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఇరాన్ల మధ్య ఉన్న తీవ్ర విభేదాలను అధిగమించి BRICS సమ్మిట్ సంయుక్త ప్రకటనను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ ప్రకటనలో ఇరాన్పై దాడుల విషయంలో అమెరికా ప్రస్తావనను నివారించారు. న్యూఢిల్లీ డిక్లరేషన్లో BRICS నాయకులు, “చర్చలు మరియు దౌత్య మార్గాల ద్వారా” సంఘర్షణను ముగించాలన్న భారత్ పిలుపును బలపరుస్తూనే, వర్తించే అంతర్జాతీయ చట్టాలకు లోబడి ప్రపంచ వాణిజ్యం, సరఫరా గొలుసులు (Supply Chains), ఇంధన ప్రవాహం సాఫీగా సాగేలా చూడటానికి ఉమ్మడి ప్రయాసలు అవసరమని ఉద్ఘాటించారు.
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన BRICS కూటమి 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఎఇ, సౌదీ అరేబియాలను చేర్చుకుని విస్తరించింది; 2025లో ఇండోనేషియా చేరింది. బెలారస్, బొలీవియా, కజాఖ్స్తాన్, క్యూబా, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం గత ఏడాది BRICS భాగస్వామ్య దేశాలుగా మారాయి.
BRICS సమ్మిట్ 2026 రెండో రోజున ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ నా వ్యక్తిగత అనుభవం నుండి చెప్పగలను, గ్లోబల్ సౌత్ దేశాలకు BRICS పై నమ్మకం పెరిగింది. ఎందుకంటే వారి స్వరం ఇక్కడ వినిపిస్తోంది, వారి అనుభవాలకు గౌరవం లభిస్తోంది. పరిష్కారాలు కేవలం వారి కోసం మాత్రమే కాక, వారితో కలిసి రూపొందించబడుతున్నాయి. BRICS బలం మన వైవిధ్యం మరియు సహకారంలో ఉంది. మనం విభిన్న పరిస్థితులలో వేరూనుకుని ఉండవచ్చు, కానీ కలిసికట్టుగా సహకారం ద్వారా ఎదుగుతాము, మానవత్వం కోసం వికసిస్తాము. మన వైవిధ్యమే మన గుర్తింపుగా ఉండాలి, మన సహకారమే మనకు స్ఫూర్తిగా నిలవాలి, మన పురోగతి సమస్త మానవాళికి ప్రయోజనం చేకూర్చాలి అన్నారు.
Also Read:శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం!

