ISRO:గగన్‌యాన్ అప్‌డేట్

1
- Advertisement -

GSLV-F17 మిషన్ ప్రయోగాన్ని ప్రశంసిస్తూ, ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ దీనిని భారతదేశానికి దక్కిన గొప్ప విజయంగా అభివర్ణించారు. అంతేకాకుండా గగన్‌యాన్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ దీనిపై పనిచేయడం చాలా వేగంగా మరియు క్రమబద్ధంగా జరుగుతోందని తెలిపారు. GSLV-F17 మిషన్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆధునిక భూ పరిశీలన ఉపగ్రహం (EOS-05) నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టబడిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఛైర్మన్ వి. నారాయణన్ శుక్రవారం తెలిపారు. ఇది దేశానికి దక్కిన అద్భుతమైన విజయమని, ప్రస్తుతం ఉపగ్రహం ఆరోగ్యం చాలా బాగుందని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలో జరిగిన ఉదయం విలేకరుల సమావేశంలో ఇస్రో ఛైర్మన్ మాట్లాడుతూ.. GSLV-F17 భారతదేశానికి ఎంతో కీలకమైన మిషన్ అని, భూ పరిశీలన కోసం ఒక ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ కక్ష్యలోకి పంపడం ఇదే మొదటిసారి అని చెప్పారు. మన దేశాన్ని, పొరుగు ప్రాంతాలను పరిశీలించడానికి ఈ ప్రయోగం ఎంతో కీలకమైనదని తెలిపారు.

ఈ ఉపగ్రహం ఆయుర్దాయం ఏడేళ్లపాటు ఉంటుందని చెప్పినప్పటికీ, ఇది తొమ్మిదేళ్ల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.మన దేశ భూ పరిశీలన అవసరాల కోసం, వివిధ ఉపయోగాల నిమిత్తం 36,000 కిలోమీటర్ల జియో-ప్లాట్‌ఫామ్‌లోకి ప్రవేశపెట్టిన మొదటి ఉపగ్రహం ఇదే. ఇప్పటివరకు GSLV వాహననౌక మోసుకెళ్లిన అత్యంత బరువైన ఉపగ్రహం ఇది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రెండవ విజయవంతమైన మిషన్ అని పేర్కొన్నారు.

ఈ క్యాలెండర్ సంవత్సరంలో చేపట్టబోయే మొదటి మానవరహిత గగన్‌యాన్ మిషన్ పనులు చాలా వేగంగా క్రమబద్ధంగా సాగుతున్నాయని చెప్పారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో మరో ఆరు ప్రయోగాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గగన్‌యాన్ సాంకేతికంగా అత్యంత సంక్లిష్టమైన మిషన్. ఇప్పటివరకు సుమారు 8,000 పరీక్షలు పూర్తయ్యాయి. సాధారణ ఉపగ్రహ మిషన్లలా కాకుండా ఇందులో మానవులు భాగమవుతారు కాబట్టి, మానవ భద్రత చాలా ముఖ్యం. అందుకే మానవసహిత మిషన్‌కు ముందు మూడు మానవరహిత మిషన్లను ప్లాన్ చేశాం అని వివరించారు.

Also Read:శ్రీ కృష్ణాష్టమి…విశిష్టత

- Advertisement -