జాతీయ క్రీడా దినోత్సవం..విశేషాలు

1
- Advertisement -

భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 29న ‘జాతీయ క్రీడా దినోత్సవం’ ఘనంగా జరుపుకుంటారు. భారత హాకీ దిగ్గజం, ‘హాకీ విజార్డ్’ అని పిలవబడే మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా పాటిస్తారు. ఈ సందర్భంగా ఫిట్‌నెస్, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి మరియు క్రీడా నైపుణ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు, భారత క్రీడా చరిత్రలో నిలిచిపోయిన 5 చారిత్రాత్మక ఘట్టాలను ఒకసారి గుర్తుచేసుకుందాం:

భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 1928 (ఆమ్‌స్టర్‌డామ్), 1932 (లాస్ ఏంజిల్స్) మరియు 1936 (బెర్లిన్) ఒలింపిక్స్‌లో వరుసగా బంగారు పతకాలను కైవసం చేసుకుంది. ఈ అపూర్వ విజయాల్లో మేజర్ ధ్యాన్ చంద్ కీలక పాత్ర పోషించి, ప్రపంచంలోనే అత్యుత్తమ హాకీ క్రీడాకారుడిగా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు.

1983లో కపిల్ దేవ్ సారథ్యంలో తొలిసారిగా వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత్, ఆ తర్వాత 2011లో ఎం.ఎస్. ధోనీ నాయకత్వంలో మరోసారి వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచింది. అంతేకాకుండా, 2007, 2024 మరియు 2026లలో టి20 ప్రపంచకప్‌లను సాధించడంతో పాటు 2013, 2025లలో ఛాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకుని ప్రపంచ క్రికెట్‌లో భారత్ తన తిరుగులేని ఆధిపత్యాన్ని నిరూపించుకుంది.

2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటర్ అభినవ్ బింద్రా వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఆయన సాధించిన ఈ విజయం, భారత షూటింగ్ రంగానికి మరియు క్రీడారంగానికి ఒక మైలురాయిగా నిలిచింది.

2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా పురుషుల జావెలెక్ త్రోలో బంగారు పతకం సాధించి అద్భుతం చేశారు. తద్వారా ఒలింపిక్స్ అథ్లెటిక్స్ (ట్రాక్ అండ్ ఫీల్డ్) విభాగంలో స్వర్ణం సాధించిన మొట్టమొదటి భారతీయ అథ్లెట్‌గా ఆయన రికార్డు సృష్టించారు.

Also Read:ఇమ్రాన్‌కు మద్దతుగా కమిన్స్

- Advertisement -