E20పై కేజ్రీవాల్ పోరుబాట

1
- Advertisement -

E20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా దాదాపు 2.30 లక్షలకు పైగా వినతిపత్రాలను సమర్పించేందుకు ప్రధాని నివాసానికి బయలుదేరిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఇతర పార్టీ నాయకులను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, ఆప్ నాయకురాలు జాస్మిన్ షా మరియు ఇతర నాయకులతో కలిసి ఫిరోజ్ షా రోడ్డులోనే నిరసనకు దిగారు. ప్రభుత్వం E20 పెట్రోల్‌ను ప్రోత్సహిస్తున్న విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సేకరించిన వినతిపత్రాలను సమర్పించడానికి దాదాపు 100 మంది ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. ఎథనాల్ కలిపిన ఇంధనం వల్ల వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారని చాలామంది ఆరోపిస్తున్నారు. అయితే, దీనిపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది.

మార్చ్ ప్రారంభానికి ముందు మద్దతుదారులను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా ప్రజల నుండి సేకరించిన 2.30 లక్షలకు పైగా సంతకాలతో కూడిన వినతిపత్రాలను తీసుకెళ్తున్నామని, కోట్ల మంది వాహనదారుల ఆందోళనలను ప్రభుత్వం ఆలకించాలని కోరారు.

దేశవ్యాప్తంగా ప్రజలు సంతకాలు చేసిన 2.30 లక్షలకు పైగా వినతిపత్రాలతో మేము ప్రధానమంత్రి నివాసానికి వెళ్తున్నాం. E20 పెట్రోల్ వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న కోట్ల మంది వాహనదారుల బాధలను ప్రభుత్వం వినాలని మేము కోరుకుంటున్నాం అన్నారు. E20 ఇంధనానికి వ్యతిరేకంగా ఆప్ …ఎథనాల్ టౌన్ హాల్ నిర్వహించి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కొన్ని రోజులకే ఈ నిరసన జరిగింది.

Also Read:మౌళి తనుజ్..’దొంగ నా కొడుకు’

ఎథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై ఉన్న ఆందోళనలను చర్చించేందుకు సమయం కేటాయించాలని కోరుతూ కేజ్రీవాల్ అంతకుముందు ప్రధానికి లేఖ కూడా రాశారు.

- Advertisement -