ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత సీనియర్ బిజెపి నాయకుడు ప్రహ్లాద్ జోషి కేంద్ర విద్యా శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం మరియు అనేక క్యాబినెట్ పోర్ట్ఫోలియోలకు ప్రసిద్ధి చెందగా తాజాగా విద్యాశాఖ మంత్రిగాబాధ్యతలు చేపట్టనున్నారు జోషి.
ప్రస్తుతం జోషి వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిగా అలాగే నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగా సేవాలందిస్తున్నారు. ప్రహ్లాద్ జోషి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (B.A.) డిగ్రీ చేశారు.
నవంబర్ 27, 1962న కర్ణాటకలోని విజయపుర (గతంలో బీజాపూర్)లో జన్మించిన ప్రహ్లాద్ జోషి ఒక సాధారణ కుటుంబంలో పెరిగారు. ఆయన తండ్రి ఇండియన్ రైల్వేస్లో పనిచేసేవారు. జోషి ఆర్ట్స్లో డిగ్రీ పూర్తి చేయడానికి ముందు కర్ణాటకలోనే తన పాఠశాల విద్యను దాదాపు పూర్తి చేశారు.ఆయన చిన్న వయస్సులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో అనుబంధం ఏర్పరచుకున్నారు మరియు తరువాత కర్ణాటకలో సంస్థాగత మరియు రాజకీయ కార్యకలాపాల ద్వారా ప్రజా జీవితంలోకి ప్రవేశించారు.
ప్రహ్లాద్ జోషి 2004 నుండి లోక్సభలో ధార్వాడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన వరుసగా ఐదుసార్లు ఎన్నికై కర్ణాటకకు చెందిన అత్యంత అనుభవజ్ఞులైన బిజెపి పార్లమెంటేరియన్లలో ఒకరిగా నిలిచారు.
బిజెపి కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడిగా , కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా,కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా,కేంద్ర గనుల శాఖ మంత్రిగా,కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిగా,కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగా సేవలందించారు. , ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరీక్షణలకు అనుగుణంగా నడుచుకుంటానని మరియు భారతదేశ విద్యా రంగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని జోషి చెప్పారు.
Also Read:మూత్రంలో రక్తం పడుతుందా?

