ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా మూడో టీ20లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో ఇరు జట్లు తలపడగా టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 201 పరుగుల భారీ స్కోరు చేయగా భారత జట్టు కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయి 125 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.
ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ20 అనంతరం కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ…తమ జట్టు ప్రదర్శనను ‘దారుణం’ అని అభివర్ణించాడు. ఇంతటి భారీ తేడాతో ఓడిపోవడం భారత జట్టుకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డాడు. మా ప్రదర్శన చాలా దారుణంగా ఉందని నేను భావిస్తున్నాను. నిజాయితీగా చెప్పాలంటే, దీనికంటే మెరుగైన పదాన్ని నేను ఉపయోగించలేను. ఇంత భారీ మార్జిన్తో ఓడిపోవడం ఖచ్చితంగా ఆమోదయోగ్యం కాదు. అన్నింటికంటే ముందుగా, మేము ఈ ఓటమిని అంగీకరించాలి. మళ్లీ మొదటి నుండి సమీక్షించుకుని, మేము ఎక్కడ తప్పు చేశామో చూసుకోవాలి అని మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ప్రెజెంటేషన్ వేడుకలో అయ్యర్ అన్నాడు.
ఈ ఓటమి కారణంగా నాలుగో టీ20 మ్యాచ్లో టీమిండియా కొన్ని మార్పులతో బరిలోకి దిగక తప్పదని, జట్టును మెరుగుపరుచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశమని అయ్యర్ పేర్కొన్నాడు.
భారత టీ20 కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి టీమిండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడం గమనార్హం. ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన భారత్, ఇంగ్లాండ్తో జరిగిన మూడు టీ20ల్లో రెండింటిలో ఓడిపోయింది (మొదటి మ్యాచ్ ఫలితం తేలకుండా రద్దయింది).
Also Read:వీడియో..రిల్స్ కోసం ప్రాణాలతో చెలగాటం

