భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) శనివారం ముంబై నగరానికి వీకెండ్ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఠాణే, రాయగఢ్, పాల్ఘర్ జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. జూలై 4 నుండి 6 వరకు ముంబై మరియు ఇతర ప్రాంతాలలో అత్యంత భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కోరారు. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించాలని BMC సూచించింది.
రెడ్ అలర్ట్ కారణంగా శనివారం నాడు ఠాణే, నవీ ముంబైలలో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. కల్యాణ్-డోంబివ్లిలలోని విద్యాసంస్థలకు కూడా ఇటువంటి ఆదేశాలే జారీ అయ్యాయి.
వారమంతా కురిసిన భారీ వర్షాల కారణంగా ముంబై నగరం స్తంభించిపోయింది. పలు ప్రాంతాలు జలమయమవడంతో పాటు వరద లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. డజన్ల కొద్దీ చెట్లు కూలిపోవడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోకల్ రైళ్ల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. ముంబైలో ఇప్పటివరకు భారీ వర్షాల కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు.
BMC సమాచారం ప్రకారం.. పొరుగున ఉన్న ఠాణే, పాల్ఘర్ జిల్లాల్లో శని, ఆదివారాల్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ విధించారు. అలాగే రాయగఢ్ జిల్లాకు శుక్ర, శనివారాల్లో IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. జూలై 4 నుండి జూలై 6 వరకు ముంబై మరియు ఇతర ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్లైన్ నంబర్లను వాడాలని BMC ప్రజలను కోరగా రెడ్ అలర్ట్ నేపథ్యంలో శనివారం పలు పాఠశాలలు సెలవు ప్రకటించాయి.
Also Read:SIR పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ: కేటీఆర్

