రెబల్ ఎంపీలపై ‘ఉద్ధవ్’ పోరు!

1
- Advertisement -

పార్టీలో తిరుగుబాటు నేపథ్యంలో శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్ ఠాక్రే తిరుగుబాటు చేసిన పార్టీ ఎంపీల నియోజకవర్గాలతో సహా వివిధ ప్రాంతాల్లోని పార్టీ కార్యకర్తలను కలుసుకోవడానికి మహారాష్ట్రవ్యాప్త ప్రజాసంప్రదింపుల (అవుట్‌రీచ్) ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఉద్ధవ్ ఠాక్రే జూన్ 27న తన యావత్మాల్ పర్యటనతో ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత విదర్భలోని వాషిమ్, మరాఠ్వాడా ప్రాంతంలోని హింగోలిలలో పర్యటిస్తారు. జూన్ 28న పర్భణీ, ధారాశివ్‌లలో పర్యటించనుండగా, జూన్ 29న షిరిడీని సందర్శిస్తారు.

యావత్మాల్-వాషిమ్ ఎంపీ సంజయ్ దేశ్‌ముఖ్, హింగోలి ఎంపీ నాగేష్ పాటిల్ అస్తికర్, పర్భణీ ఎంపీ సంజయ్ జాదవ్, షిరిడీ ఎంపీ భౌసాహెబ్ వాక్‌చౌరే, ముంబై నార్త్ ఈస్ట్ ఎంపీ సంజయ్ దినా పాటిల్, మరియు ఉస్మానాబాద్ ఎంపీ ఓంప్రకాష్ రాజే నింబాల్కర్.. సేన (యుబిటి) పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరుకాకుండా గైర్హాజరయ్యారు. వీరంతా ఏకనాథ్ షిండే నేతృత్వంలోని వర్గంలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో, ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం ముంబైలోని యుబిటి సేన భాండూప్ వెస్ట్, ఘాట్‌కోపర్ కార్యాలయాలను సందర్శించి పార్టీ కార్యకర్తలతో సంభాషించారు. సంజయ్ దినా పాటిల్‌తో పాటు ఇతర తిరుగుబాటు ఎంపీలపై విమర్శలు గుప్పిస్తూ, వారు తమను తాము “అమ్ముకున్నారని” ఠాక్రే ఆరోపించారు.

Also Read:ఏడు కొత్త బుల్లెట్ రైలు కారిడార్లు!

ద్రోహాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ…ఎంపీలు అమ్ముడుపోతున్నప్పటికీ, శివసైనికులు ఇంకా పట్టుదలతో నిలబడే ఉన్నారు. ఆ ద్రోహికి ఓటు వేయమని మిమ్మల్ని అడిగినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. నేను అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రచారం చేశాను. నేనే అతనికి (సంజయ్ దినా పాటిల్) టికెట్ ఇచ్చాను. గెలిచిన తర్వాత అతను తన ధరను పెంచుకున్నాడు ఆపై తనను తాను అమ్ముకున్నాడు. ఈ ధోరణి చాలా ప్రమాదకరమైనది అని ఆయన అన్నారు.

- Advertisement -