ఇరాన్ శాంతి ఒప్పంద నిబంధనలను విడుదల చేయడంలో వాషింగ్టన్ ఎందుకు ఆలస్యం చేసిందో వివరిస్తూ అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్…పాకిస్తాన్ పత్రికా స్వేచ్ఛపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, ఖతార్ వ్యవస్థలలో వారికి మనలాంటి ఫస్ట్ అమెండ్మెంట్ (భావప్రకటన స్వేచ్ఛను ఇచ్చే అమెరికా రాజ్యాంగ సవరణ) మరియు పత్రికా స్వేచ్ఛ ఉండవు అన్నారు.
ఇరాన్లో యుద్ధాన్ని ముగించడానికి తాత్కాలికంగా చేసుకున్న ఏర్పాట్లను మధ్యప్రాచ్యంలో మరింత విస్తృతమైన, శాశ్వతమైన శాంతి ఒప్పందంగా మార్చే ప్రయత్నాలకు ఇటీవలి పోరాట తీవ్రత ముప్పుగా మారిన తర్వాత, లెబనాన్లో ఇజ్రాయెల్ – హెజ్బుల్లా శుక్రవారం కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి.
ఇదిలావుండగా, ఇరాన్తో జరగబోయే అణు ఒప్పందంపై ప్రాథమిక రౌండ్ చర్చల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ స్విట్జర్లాండ్ వెళ్తున్నట్లు అమెరికా అధికారిని ఉటంకిస్తూ యాక్సియోస్ (Axios) శుక్రవారం నివేదించింది.
లెబనాన్లో మళ్లీ చెలరేగిన ఘర్షణల కారణంగా వాయిదా పడిన ఈ చర్చల్లో పాల్గొనకూడదని వాన్స్ తన పర్యటనను రద్దు చేసుకున్న మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ నౌకాయానాన్ని పునరుద్ధరించడానికి కీలకమైనవిగా భావించే ఈ చర్చలపై ప్రస్తుత ఉద్రిక్తతలు తాజా సందేహాలను రేకెత్తించాయి.
పశ్చిమ ఆసియాలో ఘర్షణలను ముగించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియాన్ బుధవారం ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకాలు చేశారు. జి7 (G7) సదస్సు ముగిసిన అనంతరం పారిస్ సమీపంలోని ప్యాలెస్ ఆఫ్ వెర్సైల్స్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో జరిగిన డిన్నర్ సమావేశం తర్వాత ట్రంప్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు.
ఈ ఒప్పందం కింద అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించడం, హార్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య రవాణాకు సురక్షితమైన మార్గాన్ని కల్పించడం, ఇరాన్పై ఆంక్షల సడలింపు మరియు స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తుల విడుదలకు హామీ ఇస్తుంది. అంతేకాకుండా టెహ్రాన్ పునర్నిర్మాణ నిధి కోసం 300 బిలియన్ డాలర్లను సమకూర్చడానికి వాషింగ్టన్ కట్టుబడి ఉంది.
Also Read:విక్రమ్ మాలిక్గా రాఘవ్ జుయల్
టెహ్రాన్ అణు కార్యక్రమంపై చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో, ఇరాన్పై అమెరికా ఉమ్మడి దాడులు నిర్వహించిన తర్వాత ఫిబ్రవరి 28న పశ్చిమ ఆసియాలో ఈ ఘర్షణలు చెలరేగాయి. దీనికి ప్రతిస్పందనగా, ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో వాషింగ్టన్తో సంబంధం ఉన్న కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది, ఆ తర్వాత హార్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో తీవ్ర అలజడిని సృష్టించింది.

