కేరళ సీఎంగా సతీశన్ ప్రమాణం

3
- Advertisement -

కేరళ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.డి. సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్… సతీశన్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. సతీశన్‌తో పాటు 21 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇతర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.

140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో 63 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఈ కూటమి, మొత్తం 102 స్థానాలను కైవసం చేసుకుని భారీ మెజారిటీని సాధించింది. ఈ ఎన్నికల్లో ఐయూఎంఎల్ 22 స్థానాల్లో విజయం సాధించగా, ఎల్‌డీఎఫ్ (LDF) 35 స్థానాలకు పరిమితమైంది. అలాగే బీజేపీ మూడు నియోజకవర్గాల్లో విజయం సాధించగలిగింది.

Also Read:చైనాలో పుతిన్ పర్యటన

- Advertisement -