అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాజస్థాన్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని రక్షించాల్సిన పరిస్థితిలో రాజస్థాన్ బౌలర్లు చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ను తమవైపు తిప్పుకున్నారు.
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు… జైస్వాల్ (55 పరుగులు, 36 బంతులు) మరియు వైభవ్ సూర్యవంశితో కలిసి 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. తర్వాత ధృవ్ జురేల్ బాధ్యత తీసుకుని 42 బంతుల్లో 75 పరుగులు చేసి జట్టును 210 పరుగుల భారీ స్కోర్కు చేర్చాడు.
211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కు సాయి సుదర్శన్ 44 బంతుల్లో 73 పరుగులు చేసి మంచి ఆరంభం ఇచ్చాడు. రాజస్థాన్ విజయానికి కీలక పాత్ర పోషించిన రవి బిష్ణోయ్ నాలుగు వికెట్లు తీసి గుజరాత్ మిడిల్ ఆర్డర్ను కుదేలు చేశాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ చేసిన పెనాల్టిమేట్ ఓవర్లో కేవలం 4 పరుగులే ఇచ్చి మ్యాచ్ను మలుపు తిప్పాడు. చివరి ఓవర్లో 11 పరుగులు కావాల్సిన పరిస్థితిలో తుషార్ దేశ్పాండే అద్భుతంగా బౌలింగ్ చేసి రాజస్థాన్కు విజయం అందించాడు.

