బంగ్లా ఎన్నికల్లో BNP ప్రభంజనం

8
- Advertisement -

బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికల్లో బీఎన్‌పీ ప్రభంజనం సృష్టించింది. 300 సభ్యుల పార్లమెంట్‌లో బీఎన్‌పీ 207 స్థానాల్లో గెలుపొందింది. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అధికారిక ఫలితాలను కొన్ని గంటల్లో ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రతినిధి తెలిపారు.

11 పార్టీల కూటమిగా పోటీ చేసిన Jamaat-e-Islami 46 స్థానాలు గెలుచుకోగా, నేషనల్ సిటిజన్ పార్టీ 6 స్థానాలు సాధించింది. స్వతంత్రులు మరియు ఇతరులు 5 స్థానాల్లో విజయం సాధించారు.

ఈ ఎన్నికలు ఆగస్టు 2024లో అవామీ లీగ్ ప్రభుత్వం పతనం అనంతరం 18 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన అంతరిమ ప్రభుత్వాన్ని భర్తీ చేయడానికి నిర్వహించబడ్డాయి. ఆ అంతరిమ ప్రభుత్వానికి మమ్మద్ యూనస్ నాయకత్వం వహిస్తున్నారు.

ఈసారి ప్రధాన పోటీ బీఎన్‌పీ మరియు జమాత్-ఎ-ఇస్లామీ మధ్య జరిగింది. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ రద్దు కావడంతో ఎన్నికల్లో పాల్గొనలేదు. బీఎన్‌పీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, మాజీ ప్రధాని ఖలేదా జియా కుమారుడు తారిక్ రహమాన్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ ఇప్పటికే ప్రకటించింది.

Also Read:‘ది ప్యారడైజ్’..రిలీజ్ డేట్ ఫిక్స్‌

దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయబడ్డాయి. సుమారు 10 లక్షల భద్రతా సిబ్బందిని మోహరించారు. 300 స్థానాల్లో 299 స్థానాలకు ఓటింగ్ జరగగా, ఒక నియోజకవర్గంలో అభ్యర్థి మరణంతో ఎన్నిక వాయిదా పడింది. మొత్తం 2,000 మందికి పైగా అభ్యర్థులు పోటీ చేశారు.

- Advertisement -