పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతున్న సందర్భంగా, జాతీయ రాజధానిలో పెరుగుతున్న కాలుష్య సమస్యపై ప్రతిపక్షం ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గత శుక్రవారం దిల్లీ గాలి కాలుష్యంపై సభలో వివరమైన చర్చ కోరారు. ఆదివారం దిల్లీ AQI 269గా నమోదై తాత్కాలికంగా కొంత మెరుగైన పరిస్థితి కనిపించినా, సోమవారం మళ్లీ విషపూరిత పొగమంచు నగరాన్ని చుట్టుముట్టి AQI 300 దాటింది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) ప్రకారం, ఆనంద్ విహార్—325, ఐటీవో—325 AQI నమోదు చేయగా, ఇవి “very poor” వర్గంలో ఉన్నాయి. ఇండియా గేట్, కర్తవ్య పథ్ వద్ద AQI 267గా ఉండి “poor” వర్గంలోకి చేరాయి.
ఢిల్లీ ప్రాంతాల వారీగా AQI
రోహిణి – 341
బవానా – 339
ఆర్కే పురం – 336
ముండ్కా – 330
పంజాబీ బాగ్ – 328
ఎన్ఎస్ఐటి ద్వారకా – 195
మందిర్ మార్గ్ – 207
ఐజీఐ ఎయిర్పోర్ట్ T3 – 248
జహాంగీర్పురి – 321
వివేక్ విహార్ – 321
షాదీపుర్ – 324
పూసా – 322
CPCB ప్రమాణాల ప్రకారం AQI:0–50 ‘good’, 51–100 ‘satisfactory’, 101–200 ‘moderate’, 201–300 ‘poor’, 301–400 ‘very poor’, 401–500 ‘severe’.
గ్రేటర్ కళ్యాణి-II వెల్ఫేర్ అసోసియేషన్ దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి, కాలుష్యాన్ని నియంత్రించేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాలని కోరింది. శీతాకాలంలో AQI తరచూ “very poor”, “severe”, “hazardous” వర్గాలకు చేరుతున్నందున ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పిటిషన్ పేర్కొంది శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని బలంగా లేవనెత్తనున్నాయి. రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై “ఆరోగ్య అత్యవసర పరిస్థితి”పై మౌనం ఎందుకు? అని ప్రశ్నించారు.
Also Read:అఖండ తాండవం..హై మూమెంట్స్!

