నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది పారడైజ్’. శ్రీకాంతె ఓదెల దర్శకత్వం వహిస్తుండగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్ర నిర్మాతలు ఒక భారీ ఇంటి సెట్ను నిర్మించడానికి సుమారు రూ. 7.5 కోట్లు ఖర్చు చేశారు. ఈ సెట్ హైదరాబాద్లోని ప్రసిద్ధ ఫలక్నుమా ప్యాలెస్ను పోలి ఉండేలా రూపొందించారు. నగరంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సెట్ను వేశారు.
ఈ సినిమా నుండి మరో గ్లింప్స్ను డిసెంబర్ చివరి నాటికి లేదా జనవరి ప్రారంభంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎల్.వి. సినిమాస్ సంస్థ ఈ పాన్-ఇండియా చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా మార్చి 26, 2026 న ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో కూడా విడుదల కానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read:తోట తరణికి అత్యున్నత పురస్కారం

