సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో రీసెంట్ కుబేర తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో నటించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ఖాన్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనుండగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్ భారీ క్రేజ్ను నెలకొల్పాయి.
ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురాగా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది కూలీ. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సినిమా చూశారు. ఈ చిత్ర నిర్మాత కళానిధి మారన్తో దర్శకుడు లోకేష్ కనగరాజ్తో కలిసి సినిమాను వీక్షించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Also Read:తమిళనాడు గవర్నర్కి షాక్!

