ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు!

14
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నేడు చరిత్ర సృష్టించిన రోజు అన్నారు సీఎం చంద్రబాబు. ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు… అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు అన్నారు.

సైకో పాలనకు అంతం పలికి.. ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు అని గుర్తు చేశారు. ఉద్యమంలా ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజు… ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు అన్నారు.

పసుపు సైనికుల పోరాటాలు, జన సైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు అన్నారు. విధ్వంస పాలకులపై రాజీ లేని పోరాటంతో కూటమి విజయానికి నాంది పలికిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు, ధన్యవాదాలు చెప్పారు.

Also Read:నా మాటలను అపార్థం చేసుకున్నారు!

- Advertisement -