- Advertisement -
2021లో విడుదలైన తమిళ బ్లాక్ బాస్టర్ చిత్రం “సార్పట్ట పరంపర” . బాక్సింగ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి పా. రంజిత్ దర్శకత్వం వహించారు. ఆర్య, పశుపతి, అనుపమ కుమార్, కిషోర్, జాన్ కొక్కెన్ తదితరులు నటించారు.
కరోనా లాక్ డౌన్ సమయంలో నేరుగా ఓటిటిలోనే విడుదల అయ్యిన ఈ చిత్రం భారీ రెస్పాన్స్ ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్గా సార్పట్ట 2 రానున్న సంగతి తెలిసిందే.
ఈ ఆగస్ట్ నుంచే సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి అవైటెడ్ సీక్వెల్ కి సమయం దగ్గరకి వచ్చింది అని చెప్పాలి.
Also Read:OG:పవన్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Advertisement -

