- Advertisement -
అలిపిరి నడక మార్గంలోని మోకాలి మిట్ట వద్ద సోమవారం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
నడక మార్గంలోని మరుగుదొడ్లను పరిశీలించి అక్కడున్న సిబ్బందిని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అంబులెన్స్ సర్వీసును పరిశీలించి ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. తిరుమలకు వస్తున్న భక్తులతో మాట్లాడి నడక దారిలో టీటీడీ ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి అభిప్రాయాలు సేకరించారు.
అనంతరం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఈవో తనిఖీలు నిర్వహించారు. అక్కడ భక్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదంపై భక్తుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించారు.
Also Read:వేసవిలో చర్మసమస్యలా.. అయితే!
- Advertisement -