పార్లమెంట్‌ సమావేశాల్లో గందరగోళం

2
- Advertisement -

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. శనివారం పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టగా ఇవాళ ఉభయ సభలు తిరిగి ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ నేపథ్యంలో లోక్‌సభలో గందరగోళం నెలకొంది.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఇటీవలే తొక్కిసలాట జరుగగా దీనిపై చర్చకు పట్టుబట్టారు విపక్ష ఎంపీలు. వెల్‌లోకి వచ్చిన విపక్ష ఎంపీలు నినాదాలు చేయగా సభలో గందరగోళం నెలకొంది.

మృతుల జాబితాను విడుదల చేయాలని ఎంపీలు డిమాండ్‌ చేశారు. మృతుల సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. సభలో ఎంపీల తీరుపై స్పీకర్‌ ఓం బిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Also Read:పంచాయతీ ఎన్నికలపై పొంగులేటి!

- Advertisement -