అక్కినేని ఇంట..పెండ్లి పనులు షురూ

3
- Advertisement -

అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి పనులు మొదలయ్యాయి. పసుపు దంచే కార్యక్రమంలో శోభితా దూళిపాళ్ల పాల్గొన్నారు. ఇప్పటికే నాగ చైతన్య – శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

ఆగస్టు 8న వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరుగగా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు నాగార్జున. మా కుటుంబంలోకి శోభితను స్వాగతిస్తున్నామని ఎక్స్ వేదికగా వెల్లడించారు.

వాస్తవానికి సమంతతో విడాకుల తర్వాత శోభితతో నాగచైతన్య ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అంతేగాదు వీరిద్దరూ కలిసి తిరిగిన ఫోటోలు వైరల్ గా కూడా మారాయి. అయితే ఈ వార్తలను చైతన్య ఎప్పుడూ ఖండించలేదు. కానీ ఎంగేజ్‌మెంట్ తర్వాత ఇది నిజమేనని తేలిపోయింది.

Also Read:50 స్కూళ్లను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి…!

- Advertisement -