కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే..

11
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది.రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పుపై స్టే విధించింది ఢిల్లీ హైకోర్టు. కేజ్రీవాల్ బెయిల్‌పై ఇచ్చిన స్టే కొనసాగుతుందని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది.

కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో ఆయన మరికొన్ని రోజుల పాటు తీహార్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇక కేజ్రీవాల్ బెయిల్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుండగా ఏం తీర్పు వెలువరించనుందనే ఉత్కంఠఅందరిలో నెలకొంది.

Also Read:ఏపీ స్పీకర్‌కు జగన్ లేఖ

- Advertisement -