Harish:సిద్దిపేటలో ప్రతి ఒక్కరూ ఉద్యమకారులే

8
- Advertisement -

సిద్దిపేటలో ప్రతి ఒక్కరూ ఉద్యమకారులే అన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్‌.. రేవంత్‌ రెడ్డి సీఎం కావచ్చు.. కానీ ఎన్నటికీ ఉద్యమకారుడు కాలేడన్నారు.

తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ద్రోహీగానే చరిత్రలో మిగిలిపోతాడన్నారు. ఎలాంటి ఆశలు లేకుండా, ఎలాంటి ఆకాంక్షలు లేకుండా, ప్రజల కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, దశాబ్దాల కలను నిజం చేయడం కోసం పనిచేసిన వారందరినీ గుర్తుచేసుకోవడమే ఈ దశాబ్ది ఉత్సవాల్లో నిజమైన పండగ అన్నారు. తెలంగాణకు కేసీఆర్‌ శ్రీరామరక్ష అని హరీశ్‌రావు అన్నారు.

ఆరోజు సమైక్య పాలనలో జై తెలంగాణ మాటను నిషేధించారని… ఇప్పుడు రేవంత్‌ రెడ్డి పాలనలో తెలంగాణ పదం మాయమైందని విమర్శించారు. కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ సోయిని ఖతం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read:రాష్ట్రాన్ని తాకిన నైరుతి..

- Advertisement -