48 గంటల్లో లొంగిపో..ప్రజ్వల్‌కు కుమార విజ్ఞప్తి

11
- Advertisement -

కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కావడం,ఆయన మాజీ ప్రధాని దేవే గౌడ మనవడు కూడా. దీంతో ప్రజలంతా ప్రజ్వల్‌ని పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణకు మాజీ సీఎం కుమార స్వామి కీలక విజ్ఞప్తి చేశారు. తనపై, హెడీ దేవెగౌడపై ఏమాత్రం గౌరవం ఉన్నా 48 గంటల్లో స్వదేశానికి తిరిగి వచ్చి సిట్‌ ఎదుట లొంగిపోవాలని కోరారు.అశ్లీల వీడియోల కేసు తమ కుటుంబం మొత్తాన్ని తల దించుకునేలా చేసిందని …ఘటనకు తాను బేషరతుగా ప్రజలకు క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు.

వెంటనే భారత్‌కు తిరిగొచ్చి పోలీసుల విచారణకు సహకరించాలని ప్రజ్వల్‌ని కోరారు కుమారస్వామి. రాజ్యసభ స్థానానికి రాజీనామా చేస్తానని దేవేగౌడ ప్రకటించగా, తామంతా అడ్డుకున్నామని ఈ సందర్భంగా కుమారస్వామి చెప్పారు.

Also Read:KTR:ప్రజా పాలన కాదు రైతు వ్యతిరేక పాలన

- Advertisement -