కూటమి ముగ్గురిది..మేనిఫెస్టో ఇద్దరిది?

18
- Advertisement -

ఏపీలో జగన్ సింగిల్ గా వస్తుండగా చంద్రబాబు నేతృత్వంలో కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. టీడీపీ – జనసేన -బీజేపీ కలిసి పోటీ చేస్తుండగా రెండు రోజుల క్రితం మేనిఫెస్టోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే కూటమి మేనిఫెస్టో కాపీ క్యాట్ అని , జగన్ పథకాలనే అమలు చేస్తామని చెప్పడం ప్రజల్లోకి వెళ్లిపోయింది.అలాగే ఈ మేనిఫెస్టోలో ఎక్కడా బీజేపీ ప్రస్తావన రాలేదు. పేరుకే మూడు పార్టీల కూటమి కాగా మేనిఫెస్టో మాత్రం రెండు పార్టీలు టీడీపీ – జనసేనదేనని టాక్ నడుస్తోంది. కూటమి మేనిఫెస్టోతో బీజేపీకి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు చెబుతుండటం విశేషం.

అలాగే పొత్తు నామ మాత్రంగా పెట్టుకున్నదే తప్ప ఇష్టపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం కలిసింది లేదు. అందులో తమ పాత్ర ఎక్కువ లేదు అని బయటపడినట్టు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కూటమి మ్యానిఫెస్టో కాపీలో ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని హైలెట్ చేయలేదు అని, కేవలం రెండు పార్టీల అధినేతల ఫోటోలు మాత్రమే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడినట్టు ఇన్సైడ్ టాక్. అంతేకాకుండా అది కేవలం ఆ రెండు పార్టీల మేనిఫెస్టో అని .. మాకు దానితో సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపినట్లు సమాచారం.

2014 లోనూ ఇదే మూడు పార్టీలు పొత్తులో ఎన్నికలకు వెళ్లాయి. అప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎన్నికలకు ముందు వందల హామీలు ఇచ్చి.. ఆ తరువాత వాటిని నెరవేర్చలేదు.. మ్యానిఫెస్టోను పార్టీ వెబ్సైట్ నుంచి మాయం చేశారు అనే వాదన వినిపించింది.

ఇప్పుడు ఆ మ్యానిఫెస్టో గురించి మాట్లాడుతుంటే అందరూ షాక్ అవుతున్నారు.ఈ హామీలకు అప్పట్లో కొత్త పార్టీ కూడా గ్యారంటీ పలికింది. మళ్ళీ అలాంటి సాధ్యం కాని హామీలు ఇచ్చే వాళ్ళకి ఓటు వేస్తే మొదటికే మోసం వస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆ హామీలతో మాకు సంబంధం లేదు అంటే ఆంద్రప్రదేశ్ జనాల పరిస్థితి ఏంటి?

మరోపక్క ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల విషయంలో కూడా అవకతవకలు జరిగాయనే వాదన కూడా ఉంది. మరోపక్క జగన్ ఇచ్చిన హామీలు తప్పిన సందర్భాలు లేవు. నెరవేర్చలేని హామీలు ఇచ్చింది లేదు. అందుకే గ్రామాల్లోని జనాలు తమ ఓటు జగన్ కే అంటూ బలంగా చెబుతున్నారు.

Also Read:‘కుబేర’…నాగార్జున ఫస్ట్ లుక్

- Advertisement -