భువనగిరిలో గెలుపు నాదే:క్యామ మల్లేష్

25
- Advertisement -

భువనగిరిలో గెలుపు తనదేనన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన.. లక్ష్మీనరసింహస్వామి దయతో పార్లమెంట్ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తానని తెలిపారు.ఎంపీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందన్నారు.

నియోజవర్గ ప్రజల అండ, స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయన్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు పదేళ్ల బీఆర్ఎస్ పాలనను నేటికీ గుర్తు చేసుకుంటున్నారని, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయన్నారు.

Also Read:ఆసనల్లో రాజు ‘శీర్షాసనం’!

- Advertisement -