ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఎంపీ అరవింద్ చురకలు

21
- Advertisement -

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై మండిపడ్డారు ఎంపీ అరవింద్. తనకు అహంకారం ఉందని జీవన్ రెడ్డి ఆయన తమ్ముని ద్వారా పాంప్లేట్లు పంచిపిస్తున్నాడన్నారు. బీజేపీ నుండి సస్పెండ్ అయిన వారితో దిష్టిబొమ్మలు దగ్ధం చేయిస్తున్నారు…కేసులు లేకుండా చూస్తానని హామీ ఇస్తున్నాడని దుయ్యబట్టారు. తాను అద్దాలు పెట్టుకుంటే తమ్మునికేం నొప్పి అంటూ ఘాటు వ్యాఖ్య చేశారు.

2014,2018 లో ఇదే చివరి ఎన్నిక అన్నడు జీవన్ రెడ్డి,2020 లో ఎమ్మెల్సీ అయ్యాడని…2022 లో గెలిస్తే మంత్రి అయిదామనుకున్నాడన్నారు. ఎమ్మెల్సీ గా 2026 వరకు పదవీకాలం ఉన్న మళ్లీ ఎంపీగా పోటీ అంటున్నాడని…2017లో 60 వేలు,2022 లో 20 వేలతో ప్రజలు ఓడించారు..మళ్ళీ లాస్ట్ అంటూ ఎంపీగా పోటీ అంటున్నారన్నారు.

ఎంపీ ఎన్నికల్లో ఇద్దరం కలిసి కొట్లాడుదామని వ్యాఖ్య చేసిన అరవింద్…చిల్లర వ్యవహారాలు వద్దని కుటుంబసభ్యులకు చెప్పాలంటూ హితవు పలికారు. 45 ఎండల్లో ఏమి చేయలేకపోయారు,ఎంపీ ఎన్నికల్లో తట్టుకోలేరని జీవన్ రెడ్డి కి అరవింద్ సూచించారు.

Also Read:పచ్చి కొబ్బరి తినడం మంచిదేనా?

- Advertisement -