- Advertisement -
బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్లో పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 58 వేల మార్కుకు చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 230 పెరిగి రూ. 63,230గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 58,100గా ఉండగా 24 క్యారెట్స్ పసిడి రేటు రూ. 230 పెరిగి రూ. 63,380కి చేరింది.
బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో రూ. 300 పెరిగి ది కేజీ వెండి ధర రూ. 79,500గా ఉండగా హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 300 పెరిగి రూ. 81 వేలుగా ఉంది.అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 2050 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ ధర 24.20 డాలర్ల వద్ద ఉంది.
Also Read:బీరకాయతో ఆ సమస్యలు దూరం!
- Advertisement -