పోచంపల్లిలో రాష్ట్రపతి ముర్ము

35
- Advertisement -

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లికి చేరుకున్నారు. మూడు ఆర్మీ హెలికాప్టర్ లలో భూదాన్ పోచంపల్లి చేరుకున్నారు. భూదానోద్యమ కారులైన ఆచార్య వినోభాబావే ,భూదాత వెదిరే రాంచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి సమావేశం వద్ద బయలు దేరారు. బాలాజీ పంక్షన్ హాల్ లో మగ్గాలు పరిశీలించిన రాష్ట్రపతి… అనంతరం చేనేత కార్మికల దంపతులతో సమావేశం అయ్యారు.

చేనేత మాస్టర్ వీవర్ శివకుమార్ తోను ప్రత్యేక సమావేశం కానున్నారు. రాష్ట్రపతి తో కలిసి కేవలం ఆరుగురికి మాత్రమే వేదికపై ఆహ్వానం అందింది. గవర్నర్ తమిళి సై,రాష్ట్ర మంత్రులు సీతక్క ,తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, స్థానిక ఎమ్మెల్యే కుంభంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇద్దరు అధికారులకు అవకాశం కల్పించారు.సుమారు నలభై నిమిషాల పాటు భూదాన్ పోచంపల్లి లో గడపనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

Also Read:అప్పులు కాదు ఆస్తులు పెంచాం: బీఆర్ఎస్

- Advertisement -