రష్మిక అక్కడే ఫోకస్ చేస్తోంది

26
- Advertisement -

రష్మిక మందన్నా ఒకే ఒక్క ‘యానిమల్’ టీజర్ తో క్రేజ్ తెచ్చుకొంది. హిందీలో బాగా పాపులర్ అయింది. సందీప్ వంగ.. బాలీవుడ్‌లో రణబీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘యానిమల్’ టీజర్ లో రష్మికతో రణబీర్ చేసిన ముద్దు స్క్రీన్ షాట్స్ నే కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో రష్మికా మందన్నా మెయిన్ హీరోయిన్‌ గా నటిస్తోంది. దాంతో, ఆమెను బాగానే హైలైట్ చేశారు. మొత్తానికి ఒక లిప్ లాక్ పుణ్యమా అని ప్రస్తుతం రణబీర్ కంటే కూడా రష్మిక మందన్నానే ఎక్కువ వైరల్ అయ్యింది.

హిందీలో ఈ చిత్రం విడుదల కాగానే మరో రెండు పెద్ద సినిమాలు లైన్లో పెట్టాలని రష్మిక మందన్నా ప్లాన్ లో ఉంది. దర్శక, నిర్మాతలు కూడా ఈ సినిమాల ఫలితాలు చూసి నిర్ణయం తీసుకుందామని ఆగుతున్నారు. ఐతే, హిందీ సినిమాలపై మాత్రం రష్మిక మందన్నా ఫోకస్ పెట్టింది. అక్కడే మరింత పేరు తెచ్చుకోవాలని తెగ ఉబలాట పడుతుంది. కాబట్టి అక్కడే బిజీ అవుతుందని.. ఆమెను తెలుగు మేకర్స్ అప్రోచ్ కూడా కావడం లేదు. సందీప్‌రెడ్డి.. గతంలో షాహీద్ కపూర్ హీరోగా ‘కబీర్‌సింగ్’ తెరకెక్కించాడు. అది ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్. ఆ సినిమా హిందీలో బాగానే ఆడింది.

సో.. యానిమల్ కి కూడా హిందీలో బాగానే గిరాకీ ఉంది. రష్మిక మందన్నా కూడా ఇదే విషయాన్ని అందరికీ చెబుతుందట. మొత్తానికి నేషనల్ రేంజ్ లో రష్మిక మందన్నా క్రేజ్ తెచ్చుకుంది. ఒక్క సినిమా టీజర్ తోనే నేషనల్ హీరోయిన్ రేంజ్ గుర్తింపు తెచ్చుకోవడం ఒక్క రష్మిక మందన్నాకే సాధ్యం అయింది. నిజానికి ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా పరిణీతి చోప్రాను తీసుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. దాంతో రష్మిక మందన్నాకి అదృష్టం పడింది.

Also Read:‘సుహాసిని, మృణాల్’లను కూడా వేధించారట

- Advertisement -