నోట్ల కట్టలతో దొరికిన కాంగ్రెస్ నేతలు..

32
- Advertisement -

తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలకు తెరలేపింది. కర్ణాటక నుండి తెలంగాణకు కాంగ్రెస్ కరెన్సీ కట్టలు తీసుకొస్తూ అడ్డంగా దొరికారు కాంగ్రెస్ నేతలు. కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన దాదాపు 42 కోట్ల డబ్బులను సీజ్ చేశారు ఐటీ అధికారులు.

కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బు… తెలంగాణ ఎన్నికల్లో ప్రలోభాల కోసం తరలిస్తూ పట్టుబడ్డ కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. దాదాపు 1500 కోట్ల రూపాయలను తరలించే ప్లాన్ చేసిన కాంగ్రెస్ పార్టీ.. 42 కోట్ల రూపాయలను తరలిస్తూ బెంగళూరులో ఐటీ అధికారులకు అడ్డంగా దొరికిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో కర్ణాటకలో 40% కమీషన్ బీజేపీ ప్రభుత్వం ఉంటే…ఇప్పుడు 50% కమీషన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని హరీష్ రావు ఆరోపించారు. ఈ అవినీతి కాంగ్రెస్ తో… తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలారా అని పిలుపునిచ్చారు.

Also Read:‘లియో’లో ‘కోబ్రా’గా చరణ్..!

- Advertisement -