భారీ వర్షాలు..బీఆర్ఎస్ నిరసనలు వాయిదా

41
- Advertisement -

రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ ఓ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలను రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వారం పాటు వాయిదా వేయాలని పార్టీ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.

వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత రైతులందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ మూడు గంటల ఉచిత విద్యుత్ విధానాన్ని ఎండగట్టేలా నిరసన కార్యక్రమాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు, రైతులకు ఈ వారం రోజులపాటు అండగా ఉండాలని భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులను, నాయకులను, కార్యకర్తలను కోరారు.

Also Read:కాంగ్రెస్ వ్యూహకర్త.. గుడ్ బై?

- Advertisement -