వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా భోళా శంకర్. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, చిరూకి చెల్లి పాత్రలో నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్, పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న బ్రో సినిమాతో పాటూ థియేటర్లలోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక ‘బ్రో’ సినిమా విషయానికి వస్తే.. ఈ జులైలో రాబోతున్న సినిమాల్లో పవన్ కళ్యాణ్, సాయి తేజ్ నటిస్తున్న బ్రో సినిమా ఒకటి.
సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రో ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నట్లు సాయి తేజ్ కన్ఫర్మ్ చేశాడు. సాంగ్ షూట్ కోసం ఆస్ట్రియా వెళ్లిన తేజ్, అక్కడ షూటింగ్ చేయడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ మరియు బోల్డ్ బ్యూటీ కేతిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతంలో, ‘శంభో శివ శంభో’ సినిమా చేసి డైరెక్టర్ గా సముద్రఖని సూపర్ హిట్ కొట్టాడు.
Also Read:ఈ లక్షణాలు ఉంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నట్లే..!
అందుకే, ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా పవన్ కళ్యాణ్ ఓ గెస్ట్ అప్పీరెన్స్ లో కనపడనున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ లో భాగం అయ్యాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాత్రను మొత్తం త్రివిక్రమ్ మార్చేశాడు. అలాగే పవన్ డైలాగ్స్ ను కూడా త్రివిక్రమ్ నే మార్చేశాడు. రచయిత సాయి మాధవ్ రాసిన మాటలను కాదు అని, పవన్ కి త్రివిక్రమ్ డైలాగ్స్ రాయడం విశేషం.
Also Read:ఎక్కిళ్లను ఆపడం ఎలా?