ప్రభాస్ తో 400 మంది?

45
- Advertisement -

ప్రభాస్ ‘సలార్’ అప్ డేట్ కోసం వేయి కళ్లతో వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్ డేట్ రివీల్ అయింది. ఈ సినిమా క్లైమాక్స్ కోసం ఏకంగా దాదాపు 400 మంది పాల్గొంటున్నారట. ‘కేజీఎఫ్’ స్థాయిలో క్లైమాక్స్ ఉంటుందని.. ఈ ఎపిసోడ్ ను వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచి షూట్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఈ క్లైమాక్స్ లో ప్రభాస్ లుక్ కూడా అదిరిపోతోందట. ఇప్పటికే ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉంది.

అందుకే, ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపడం ఖాయమని ప్రభాస్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఈ సినిమా రైట్స్ పై క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి. సలార్ ఏపీ రైట్స్‌ కోసం ఏకంగా రూ.100 కోట్ల ఆఫర్లు వస్తున్నాయట. నిజంగా ఇది సలార్ సృష్టించిన రికార్డే. మరి ఒక్క ఏపీ రైట్స్ కోసేమే అంత భారీ మొత్తం అంటే.. ఈ లెక్కన సలార్ చిత్ర వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ.200 కోట్లకు పైగా అమ్ముడు పోయే అవకాశం ఉంది.

Also Read:IPL 2023:ప్లే ఆఫ్స్‌కు ముంబై

మొత్తానికి ప్రశాంత్ నీల్ – ప్రభాస్ రికార్డ్స్ క్రియేట్ చేసేలా ఉన్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ నటిస్తోంది. రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేస్తున్నారు.

Also Read:ఓటీటీ : ఏ చిత్రం ఎందులో ?

- Advertisement -