ట్రైలర్ టాక్ : విరూపాక్ష ఇక కష్టమే

42
- Advertisement -

సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా ‘విరూపాక్ష’ అంటూ ఒక సినిమాని వదులుతున్నారు. మొదటి నుంచి ఈ సినిమాని సాయి తేజ్ విపరీతంగా ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. మరి ట్రైలర్ ఎలా ఉంది ?, ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఎలాంటి ఆసక్తిని క్రియేట్ చేయలేక పోయింది.

మరి తాజాగా విడుదలైన ట్రైలర్ అయినా ఈ సినిమాపై అంచనాలను పెంచిందా ?, చూద్దాం రండి. ట్రైలర్ లో కంటెంట్ కంటే కూడా.. బిల్డప్ ఎక్కువ అయ్యింది. నిజానికి ఈ సినిమా కథ కంటే కూడా.. పేదరాశి పెద్దమ్మ కథలు చాలా బెటర్ గా ఉంటాయి. అసలు థ్రిల్, మిస్టరీ‌ అంశాలతో ట్రైలర్ ఆకట్టుకోవాలి. కానీ, ఈ సినిమా ట్రైలర్ ఆ విషయంలో దారుణంగా విఫలం అయ్యింది.

ప్రశాంతంగా ఉన్న రుద్రవనం అనే గ్రామంలో వరుస మరణాలకు కారణమేంటి?, హీరో ఎలా చేధించాడు?.. ఇదే మెయిన్ పాయింట్. నిజానికి ఈ పాయింట్ మీద ఇప్పటికే వంద సినిమాల వరకు వచ్చి ఉంటాయి. మళ్లీ ఇదే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. మరి అలాంటప్పుడు ఇక ఈ సినిమా పై ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది ?, నూతన దర్శకుడు కావడం వల్ల కార్తీక్ దండు కూడా ఈ సినిమాని హ్యాండిల్ చేయలేక పోయాడు.

మరి ఈ చిత్రం ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. పైగా ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా అలరించడం దాదాపు కష్టమే. సాయి తేజ్ కెరీర్ లో ఈ సినిమా మరో ప్లాప్ గా నిలిచే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి…

బాలీవుడ్‌ స్టార్‌కు బెదరింపు కాల్‌..!

అనుపమ కొత్త అవతారం

Kollywood:మారితో ధనుష్ మరో కొత్త సినిమా..!

- Advertisement -