మహేష్ తో పదేళ్లు.. ఒకే సినిమా

37
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా మూడు పార్ట్‌లుగా రాబోతుందని టాక్ నడుస్తుంది. ఈ మేరకు మరో 10 సం.ల వరకు మహేశ్ బాబు కాల్షిట్స్‌ను జక్కన్న లాక్ చేసినట్లు వినికిడి. దీంతో మహేశ్ బాబును 10 సం.లు రాజమౌళి సినిమాలో మాత్రమే చూడగలమా? అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో గానీ, రాజమౌళి సినిమాల పై ఇంట్రెస్ట్ చూపించే ప్రేక్షకులను కూడా ఈ వార్త ఆందోళనకు గురి చేస్తోంది.

మొత్తానికి ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీగా తీర్చిదిద్దేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇంగ్లీష్‌లో కూడా తెరకెక్కించనున్నట్లు సమాచారం. దీంతో హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేయనున్నారనే టాక్ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె ను రాజమౌళి సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఐతే, మరో హీరోయిన్ రోల్ కోసం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను కూడా జక్కన్న అప్రోచ్ అవుతున్నారట. రాజమౌళి – మహేష్, దీపిక – ప్రియాంక చోప్రా కాంబినేషన్ అంటే.. ఈ సినిమా పై హైప్ మరింత పెరుగుతోంది.

పైగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకి హాలీవుడ్ లో కూడా మార్కెట్ ఉంది. సో.. ఏ రకంగా చూసుకున్నా, ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటించడం బెస్ట్. అందుకే, రాజమౌళి కూడా ప్రియాంక చోప్రా వైపే ఆసక్తి చూపిస్తున్నాడు. అలాగే కుదిరితే కొందరు హాలీవుడ్ నటీనటులను తీసుకుంటారట. మొత్తానికి మహేష్ కోసం రాజమౌళి భారీగానే ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ సారి జక్కన్న ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి…

ట్రైలర్ టాక్ : విరూపాక్ష ఇక కష్టమే

బాలీవుడ్‌ స్టార్‌కు బెదరింపు కాల్‌..!

ఓటీటీ : ఏ చిత్రం ఎందులో ?

- Advertisement -