తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యాసంగి పంటను మంగళవారం నుంచే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్రెడ్డి పాల్గొన్నారు. బీఆర్కే భవన్లో కలెక్టర్లు జిల్లా పౌర సరఫరాలు అధికారులు డీఎంలు ఎఫ్సీఐ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. పౌర సరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్, సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌర సరఫరాల కమిషన్ అనీల్ కుమార్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని కొనుగోళ్లకు సిద్ధం కావాలని ఆదేశించారు. రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 7100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. యాసంగికి సీజన్ సీఎంఆర్ను 30వ తేదీలోగా మిల్లర్ల నుంచి సేకరించాలని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో ఆరు రేట్ల ధాన్యం కొనుగోలు పెరగ్గా.. మిల్లింగ్ సామర్థ్యం రెండు రేట్లు మాత్రమే పెరిగిందని దీన్ని దృష్టిలో పెట్టుకొని మిల్లర్ల నుంచి సీఎంఆర్ సేకరణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న చెక్ పోస్టులను బలోపేతం చేయాలని మంత్రులు ఆదేశించారు.
ఇవి కూడా చదవండి…